Ramcharan: ఎన్టీఆర్-రామ్‌చరణ్‌ మ‌ల్టీస్టారర్ మూవీలో గ్రాఫిక్స్ వుండవట!

  • మల్టీస్టారర్ సినిమా కోసం క‌థ రెడీ చేస్తోన్న విజ‌యేంద్ర ప్ర‌సాద్‌
  • రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వంలో మ‌ల్టీస్టారర్ మూవీలో చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌
  • త‌న సినిమాల్లో గ్రాఫిక్స్‌ను బాగా వాడుకునే రాజ‌మౌళి
  • ఈ సినిమాలో మాత్రం గ్రాఫిక్స్ ఉండ‌బోవు?

సినీనటులు జూనియ‌ర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ల‌తో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తీయ‌నున్న‌ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో గ్రాఫిక్స్‌, వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్ ఉండ‌వ‌ని తెలుస్తోంది. త‌న సినిమాల్లో గ్రాఫిక్స్‌ను అధికంగా ఉప‌యోగించి ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేసే రాజ‌మౌళి త‌న కొత్త సినిమాలో మాత్రం ఆ మాయాజాలాన్ని క‌న‌బ‌ర్చ‌డం లేద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. రాజ‌మౌళి తీయ‌నున్న ఈ సినిమా కోసం ర‌చ‌యిత విజయేంద్ర ప్రసాద్ కథను రెడీ చేస్తున్నారు.

తాను త‌దుప‌రి చిత్రాన్ని వీఎఫ్‌ఎక్స్‌తో పని లేకుండా తీస్తానని రాజమౌళి కొన్ని నెల‌ల ముందు తెలిపారు. ఆయ‌న చెప్పిన ఆ మాట‌లు ఈ వార్త‌కు బ‌లాన్నిస్తున్నాయి. గ్రాఫిక్స్‌ను ఉప‌యోగించ‌కుండా రాజ‌మౌళి ఎటువంటి క‌థ‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తార‌న్న ఆస‌క్తి నెల‌కొంది. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ ల చేతుల్లో త‌లో సినిమా ఉంది. స‌ద‌రు హీరోలు ఆ సినిమాల షూటింగుల‌ను ముగించుకోగానే రాజ‌మౌళి సినిమాలో న‌టించ‌నున్నారు.

More Telugu News