Karnataka: కర్ణాటక రాష్ట్రాన్ని పొగడ్తలతో ముంచెత్తిన విజయ్ దేవరకొండ

  • కన్నడ స్టార్ గణేశ్ నటించిన 'చమక్' ఆడియో విడుద‌ల చేసిన హీరో
  • దేశానికి ఎంతోమంది క్రికెట‌ర్ల‌ను, తార‌ల‌ను క‌ర్ణాట‌క ఇచ్చిందని వ్యాఖ్య‌
  • తెలుగు సినిమాల‌ను ఆద‌రిస్తున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన విజ‌య్‌

క‌న్న‌డ స్టార్ గ‌ణేశ్ న‌టించిన 'చ‌మ‌క్‌' చిత్రం ఆడియో విడుద‌ల వేడుక‌కు టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ముఖ్య అతిథిగా హాజ‌రయ్యాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ క‌ర్ణాట‌క రాష్ట్రాన్ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు. ర‌జ‌నీకాంత్‌, అనుష్క శెట్టి, ఐశ్వ‌ర్య‌రాయ్ వంటి తార‌ల‌ను, జ‌వ‌గ‌ల్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే, వెంక‌టేశ్ ప్ర‌సాద్‌, రాహుల్ ద్రావిడ్ వంటి క్రికెట‌ర్ల‌ను క‌ర్ణాట‌క ఇచ్చింద‌ని వ్యాఖ్యానించాడు.

'నా మొద‌టి చిత్రం 'పెళ్లిచూపులు' వంద రోజులు ఆడింది. కానీ గ‌ణేశ్ గురించి గూగుల్ సెర్చ్ చేసిన‌పుడు అత‌ని మొద‌టి చిత్రం 860 రోజులు ఆడింద‌ని తెలిసి షాక‌య్యాను' అని విజ‌య్ అన్నాడు. గణేశ్ న‌టించిన 'ముంగారు మాలే' అనే చిత్రం దాదాపు 860 రోజులు ఆడింది. అలాగే తెలుగు చిత్రాల‌ను ఆద‌రిస్తున్న క‌న్న‌డిగుల‌కు కృత‌జ్ఞ‌త‌లు" అన్నాడు. 'చ‌మ‌క్‌' చిత్రంలో న‌టించిన ర‌శ్మిక, త్వ‌ర‌లో విజ‌య్ స‌ర‌స‌న తెలుగులో న‌టించ‌నుంది.

More Telugu News