shailaja: ఆసుపత్రిలో శాడిస్టు భర్త చేతిలో గాయ‌ప‌డ్డ శైలజ... క‌వ‌రేజ్‌కి వెళ్లిన విలేక‌రుల‌పై సిబ్బంది దాడి!

  • తిరుపతిలోని స్విమ్స్ ఆసుప‌త్రిలో శైల‌జ‌కు చికిత్స
  • వివ‌రాల కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై స్విమ్స్ సిబ్బంది దురుసు ప్ర‌వ‌ర్త‌న‌
  • విలేక‌రుల ఆందోళ‌న‌.. గంద‌ర‌గోళం

పెళ్లైన కొన్ని గంట‌ల‌కే శాడిస్టు భర్త రాజేష్ చేతిలో చావుదెబ్బ‌లు తిన్న‌ శైలజ అనే యువ‌తికి తిరుపతిలోని స్విమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ కేసు విచార‌ణ‌లో తాను సంసారానికి ప‌నికిరానివాడిన‌ని చెప్పుకున్న రాజేష్‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. అయితే, శైల‌జ కేసులో వివ‌రాల కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై స్విమ్స్ సిబ్బంది దురుసుగా ప్ర‌వ‌ర్తించి దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. న్యూస్ క‌వరేజీ కోసం వ‌స్తే త‌మ‌పై దాడి చేయ‌డం ఏంట‌ని విలేక‌రులు ఆసుప‌త్రి ముందు నిర‌స‌న‌కు దిగారు. దీంతో అక్క‌డ గంద‌ర‌గోళం నెల‌కొంది. 

More Telugu News