Velagapudi: అమరావతి సచివాలయంలోకి అనుకోని అతిథి... ఉద్యోగులను పరుగులు పెట్టించిన సర్పం!

  • హోమ్ శాఖ కార్యాలయంలోకి ప్రవేశించిన పాము
  • భయంతో ఉద్యోగుల పరుగులు
  • చంపేసిన పారిశుద్ధ్య కార్మికులు

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి, వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలోకి అనుకోని అతిథిగా ఓ పాము ప్రవేశించడం కలకలం రేపింది. దానిని చూసిన ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. సెక్రటేరియేట్ లోని రెండో బ్లాక్‌లో ఉన్న హోమ్ శాఖ కార్యాలయంలోకి ఈ పాము వచ్చింది.

దీంతో ఆ సమయంలో విధుల్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు పామును చంపేయడంతో ఉద్యోగులు తిరిగి వారి వారి సీట్లలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనతో దాదాపు గంట సేపు సచివాలయం హోమ్ శాఖ కార్యాలయంలో పనులు నిలిచిపోయాయి. ఆ సమయంలో హోమ్ మంత్రి చినరాజప్ప అక్కడే ఉన్నారా? లేదా? అన్న సంగతి తెలియరాలేదు.

More Telugu News