Team India: సౌతాఫ్రికాతో టెస్ట్, శ్రీలంకతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. పార్థివ్ పటేల్‌కు పిలుపు.. కుల్దీప్ యాదవ్ ఔట్!

  • చాలా కాలం తర్వాత పిలుపు అందుకున్న పార్థివ్ పటేల్
  • టెస్టు జట్టులో బుమ్రాకు చోటు
  • టీ20 సిరీస్‌కు చెన్నై ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్

శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20, దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లకు భారత జట్టును సోమవారం సెలక్టర్లు ప్రకటించారు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టిన సెలక్టర్లు పార్థివ్ పటేల్‌కు చోటు కల్పించారు. అలాగే జస్ప్రిత్ బుమ్రాను తొలిసారి టెస్ట్‌ల కోసం ఎంపిక చేశారు. ఇక శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌లో విశ్రాంతి తీసుకోనున్న కెప్టెన్ కోహ్లీ, టీ20 సిరీస్‌కూ దూరం కానున్నాడు. దీంతో వన్డే, టీ20లలో కోహ్లీకి బదులుగా రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు.

దక్షిణాఫ్రికా టూర్‌కు భారత టెస్టు జట్టు:  విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్, చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, పార్థివ్ పటేల్, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా

శ్రీలంతో టీ20 సిరీస్‌కు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోనీ, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా, జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, బాసిల్ థంపి, జయదేవ్ ఉనడ్కట్

More Telugu News