kadium srihari: లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. ‘కొలువులకై కొట్లాట’ ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు: క‌డియం శ్రీహ‌రి

  • కేసీఆర్ హామీ మేర‌కు ఉద్యోగాల భ‌ర్తీ
  • నిరుద్యోగులను రాజకీయాల కోసం రెచ్చగొట్టొద్దు
  • మేము 8,792 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేశాం

తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన‌ హామీ మేరకు లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహ‌రి అన్నారు. హైద‌రాబాద్‌లోని స‌రూర్‌న‌గ‌ర్‌లో ఈ రోజు నిర్వ‌హించిన ‘కొలువులకై కొట్లాట’ ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసునని ఆయ‌న వ్యాఖ్యానించారు. నిరుద్యోగులను రాజకీయాల కోసం రెచ్చగొట్టడం భావ్యంకాద‌ని, త‌మ‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.

రాష్ట్రంలో  8,792 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేశామ‌ని, ఆయా పోస్టుల‌ను హైకోర్టు ఆదేశాల మేరకు 10 జిల్లాల వారీగా విభజించామ‌ని తెలిపారు. టీఎస్‌పీఎస్‌సీకి ఇందుకు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను పంపుతున్నామ‌ని, దీనిపై కూడా త్వరలో నోటిఫికేషన్‌ విడుదలవుతుందని అన్నారు. 

More Telugu News