manchu vishnu: 'ఆచారి అమెరికా యాత్ర' విడుదల తేదీ ఖరారు

  • ముగింపు దశలో 'ఆచారి అమెరికా యాత్ర'
  • కథానాయికగా ప్రగ్యా జైస్వాల్
  • ముఖ్యమైన పాత్రలో బ్రహ్మానందం 
  • జనవరి 26న ప్రేక్షకుల ముందుకు  

విష్ణు కథానాయకుడిగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో 'ఆచారి అమెరికా యాత్ర' రూపొందుతోంది. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, చివరి దశకి చేరుకుంది. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. జనవరి 26వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

 పూర్తి వినోదభరితంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బ్రహ్మానందం ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. గతంలో విష్ణు - నాగేశ్వర రెడ్డి కాంబినేషన్లో వచ్చిన 'దైనికైనా రెడీ' .. 'ఈడోరకం ఆడోరకం' సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. అందువలన ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి. ఈ ఇద్దరూ కలిసి మరోసారి హిట్ కొడతారేమో చూడాలి మరి.       

More Telugu News