jayalalitha: జయలలిత సమాధి వద్ద నివాళులర్పించి.. ఉప ఎన్నిక‌కు సినీన‌టుడు విశాల్ నామినేష‌న్‌!

  • ఈ నెల 21న ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌
  • నామినేష‌న్ సెంట‌ర్‌కు వెళ్లేముందు జ‌య‌ల‌లిత స‌మాధి వ‌ద్ద‌కు విశాల్‌
  • విశాల్ రానుండ‌డంతో నామినేష‌న్ సెంట‌ర్ వ‌ద్ద కాసేపు గంద‌ర‌గోళం

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త జ‌య‌ల‌లిత స‌మాధి వ‌ద్ద సినీన‌టుడు విశాల్ ఈ రోజు నివాళుల‌ర్పించాడు. ఈ నెల‌ 21న త‌మిళ‌నాడులోని ఆర్కేనగర్‌కు ఉపఎన్నిక జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అన్నాడీఎంకే తరపున మధుసూద‌నన్ బ‌రిలోకి దిగుతుండ‌గా, శశికళ వర్గం నుంచి దినకరన్, డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేశ్, స్వతంత్రుడిగా విశాల్ ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలోనే విశాల్ జ‌య‌ల‌లిత స‌మాధి వ‌ద్ద నివాళుల‌ర్పించి, నామినేష‌న్ సెంట‌ర్‌కు వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశాడు.
 
కాగా, విశాల్ నామినేష‌న్ వేసిన ఆ సెంటర్‌లో ఇతర స్వతంత్ర్య అభ్యర్థులు నామినేషన్‌ వేసేందుకు త‌మ మ‌ద్ద‌తుదారులతో అక్క‌డికి చేరుకున్నారు. దీంతో భద్రతా సిబ్బంది ఇత‌ర‌ అభ్య‌ర్థుల మ‌ద్ద‌తుదారుల‌ను లోపలికి అనుమతించలేదు. దీంతో కాసేపు గంద‌ర‌గోళం నెల‌కొంది.

More Telugu News