Jesus Christ: ఏసు తన సోదరుడు జేమ్స్‌కు చెప్పిన రహస్య బోధనల ప్రతి దొరికింది!

  • ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ లైబ్రరీలో లభ్యమైన గ్రీకు ప్రతి
  • జేమ్స్‌ మంచి బోధకుడు కావడానికి దోహదం చేసిందన్న చరిత్రకారులు 
  • భవిష్యవాణి, స్వర్గ సామ్రాజ్యం గురించిన సమాచారం

ఏసు క్రీస్తు తన సోదరుడు జేమ్స్‌కు చెప్పినట్టుగా భావిస్తున్న రహస్య బోధనల గ్రీకు ప్రతి ఒకటి బయటపడింది. లండన్ లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని ప్రాచీన నాగ్ హమ్మాడి లైబ్రరీలో ఇది లభ్యమైంది. ఇది 2-6 శతాబ్దాల మధ్య నాటిదై ఉంటుందని భావిస్తున్నారు. క్రీస్తు తన సోదరుడు జేమ్స్‌కు బోధించిన ప్రతి ఇదేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జేమ్స్ మంచి బోధకుడు కావడానికి ఈ ప్రతి దోహదం చేసిందని చెబుతున్నారు.

తమ భాండాగారంలో ఇంత పురాతనమైన ప్రతి ఉందని తాము అనుకోలేదని యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జెఫ్రీ స్మిత్ తెలిపారు. దీనిని చూస్తుంటే ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉందని పేర్కొన్నారు. స్వర్గ సామ్రాజ్యం, జేమ్స్ మరణం, భవిష్యవాణి వంటి వాటి గురించి క్రీస్తు చెప్పిన సమాచారం ఈ గ్రీకు ప్రతిలో ఉందని ఆయన వివరించారు.

More Telugu News