teacher: పెళ్లి జ‌రిగిన కొన్ని గంట‌ల‌కే దారుణం.. పెళ్లికూతురి నోట్లో గుడ్డ‌లు కుక్కి చావ‌గొట్టిన పెళ్లికొడుకు!

  • చిత్తూరు జిల్లా మోతరంగనపల్లిలో స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునే ఘ‌ట‌న‌
  • తొలి రాత్రే త‌న భార్య‌ను గొడ్డును బాదిన‌ట్లు కొట్టిన భ‌ర్త‌
  • యువ‌తికి అపోలో ఆసుప‌త్రిలో చికిత్స‌
  • భ‌యంతో వ‌ణికిపోతోన్న వైనం

పెళ్లి జ‌రిగిన కొన్ని గంట‌ల‌కే ఓ వ్య‌క్తి దారుణ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డాడు. తొలి రాత్రే త‌న భార్య‌ను గొడ్డును బాదిన‌ట్లు బాదాడు. గ‌దిలో చావు కేక‌లు పెడుతోన్న వ‌ధువు గొంతును విన్న ఆమె తండ్రి త‌లుపులు కొట్ట‌గా, గ‌దిలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన పెళ్లి కొడుకు అక్క‌డి నుంచి పారిపోయాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు పెళ్లికొడుకుని అరెస్టు చేశారు.

వివ‌రాలు చూస్తే... చిత్తూరు జిల్లా మోతరంగనపల్లికి చెందిన కుమారస్వామిరెడ్డి కుమారుడు రాజేష్‌కు, శైలజ అనే యువ‌తికి నిన్న ఉదయం కాణిపాకంలో పెళ్లి జ‌రిగింది. రాజేష్ ఓ స్కూల్లో టీచ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. శోభ‌నం కూడా నిన్న రాత్రే ఏర్పాటు చేయ‌డంతో గదిలోకి వెళ్లిన శైలజపై పెళ్లికొడుకు ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు.

నోట్లో గుడ్డలు కుక్కి మ‌రీ విప‌రీతంగా దెబ్బ‌లు కొట్టాడు. రాజేష్ ఇలా ఎందుకు ప్ర‌వ‌ర్తించాడ‌న్న విష‌యం తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం శైల‌జ‌కు అపోలో ఆసుప‌త్రిలో చికిత్స అందుతోంది. ఈ భ‌యంక‌ర ఘ‌ట‌న గుర్తు వ‌స్తే చాలు వధువు భ‌య‌ప‌డిపోతోంది. శైల‌జ ఎంబీఏ వ‌ర‌కు చ‌దువుకున్న‌ట్లు తెలుస్తోంది.

More Telugu News