KTR: మెట్రోరైల్‌లో రైతులు, జీహెచ్ఎంసీ కార్మికులు.. అన్ని వ‌ర్గాల వారు.. కేటీఆర్ షేర్ చేసిన ఫొటోలు!

  • ప్ర‌యాణికుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోన్న మెట్రోరైల్‌ స్టేష‌న్లు
  • స‌ర‌దాగా ప్ర‌యాణిస్తోన్న వారూ ఎక్కువే..
  • అన్ని వ‌ర్గాల వారు ఉప‌యోగించుకుంటున్నారంటూ కేటీఆర్ ట్వీట్

ఇటీవ‌ల ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభ‌మైన హైద‌రాబాద్ మెట్రోరైల్‌కు అనూహ్య స్పందన వ‌స్తోంది. అన్ని వ‌ర్గాల వారు ఈ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకుంటున్నారు. స‌ర‌దాగా ప్ర‌యాణించేవారి సంఖ్య కూడా అధికంగా ఉండ‌డంతో మెట్రో స్టేష‌న్లు ప్ర‌యాణికుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి.

మెట్రోరైల్‌కు వస్తోన్న స్పంద‌న‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఈ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకుంటున్నారంటూ.. రైతులు, జీహెచ్ఎంసీ కార్మికులు, ఇత‌ర ఉద్యోగులు మెట్రోరైల్లో ఉన్న ఫొటోల‌ను ఆయ‌న పోస్ట్ చేశారు. మీరూ చూడండి... 



              

More Telugu News