malayalam: మరో మలయాళం పాటతో నెటిజన్ల మనసు దోచేస్తున్న ధోనీ కూతురు

  • ఒక్క‌రోజులో 1.5 ల‌క్ష‌ల వీక్ష‌ణ‌లు
  • జివాను ప్ర‌శంసించిన నెటిజ‌న్లు
  • త‌మ భాష‌ల పాట‌లు పాడాలంటూ కోరిన అభిమానులు

మూడేళ్లు నిండ‌క‌ముందు క్రికెట‌ర్ ధోనీ, సాక్షిల కూతురు జివా ఇంట‌ర్నెట్ సెన్సేష‌న్‌గా మారింది. త‌న ఇన్‌స్టాగ్రాంలో వీడియోలు, ఫొటోల‌తో నెటిజ‌న్ల మ‌న‌సులు దోచేస్తోంది. ఇటీవ‌ల మ‌రో మ‌ల‌యాళం భ‌క్తి పాట పాడి అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. 1964లో వచ్చిన 'ఓమ‌నకుట్ట‌న్‌' చిత్రంలోని 'క‌నికానుమ్ నీర‌మ్ క‌మ‌ల‌నేథ‌రంటే' పాట‌ను చ‌క్క‌గా పాడుతూ నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

గ‌తంలో కూడా జివా పాడిన మ‌ల‌యాళం పాట‌కు కేర‌ళ వాసులు ఫిదా అయ్యారు. దేశంలో ప‌ల‌క‌డానికి అతిక‌ష్ట‌మైన భాష‌ల్లో ఒక‌టిగా చెప్పుకునే మ‌ల‌యాళం భాష పాట‌ల‌ను జివా త‌ప్పులు లేకుండా ప‌ల‌క‌డం చూసి కేర‌ళీయులు మురిసిపోతున్నారు. ఇక ధోనీకి ఎక్కువ మంది అభిమానులు ఉండే త‌మిళ‌నాడు ప్రాంతీయులు త‌మ భాష‌లో కూడా కొన్ని పాట‌లు పాడాల‌ని జివాను కోరుతున్నారు. ఈ వీడియోకు ఒక్క రోజులోనే 1.5 ల‌క్ష‌ల వీక్ష‌ణ‌లు రావ‌డం చూస్తే తండ్రి గ్రౌండ్‌లో, కూతురు సోష‌ల్ మీడియాలో అభిమానులను సంపాదించుకుంటోంద‌ని అభిమానులు అంటున్నారు.

More Telugu News