kapu reservation bill: కాపు రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం పలికిన ఏపీ అసెంబ్లీ

  • కాపు రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
  • 55 శాతానికి చేరుకోనున్న రిజర్వేషన్లు
  • రాజకీయాలకు సంబంధం లేకుండా రిజర్వేషన్లు

50 ఏళ్ల కాపుల కల నెరవేరింది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం పలికింది. ఈ అంశంపై సభలో పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. అనంతరం బిల్లుకు ఆమోదం పలుకుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ రిజర్వేషన్లు ఉంటాయని బిల్లులో పేర్కొన్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లను కల్పించడంతో, రాష్ట్రంలో రిజర్వేషన్లు 55 శాతానికి చేరుకున్నాయి. 

More Telugu News