abuse: వీడియో తీసి యువ‌కుల‌ బెదిరింపులు.. ముగ్గురు ఏడో త‌ర‌గ‌తి విద్యార్థినుల ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!

  • విజ‌య‌వాడ‌లోని జ‌క్కంపూడి వైఎస్సార్ కాల‌నీలో ఘ‌ట‌న‌
  • స్కూల్ వ‌ద్ద బాలిక‌లు ఆడుకుంటుండ‌గా వీడియో తీసిన వైనం
  • ప్ర‌భుత్వాసుప‌త్రిలో బాలిక‌ల‌కు చికిత్స‌

విజ‌య‌వాడ‌లోని జ‌క్కంపూడి వైఎస్సార్ కాల‌నీలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో విద్యార్థినులు ఆడుకుంటుండ‌గా కొంద‌రు యువ‌కులు వారి వీడియోలను తీశారు. వాటిని మార్ఫింగ్ చేసి సోష‌ల్ మీడియాలో పెడ‌తామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. దీంతో ముగ్గురు ఏడోత‌ర‌గ‌తి విద్యార్థినులు ఎలుక‌ల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. వారిని ఉపాధ్యాయులు విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. బాలిక‌ను బెదిరించిన యువ‌కుల గురించి ఆరా తీస్తున్నారు.

More Telugu News