Love Jihad: హిందూ మతంలోకి మారితేనే పెళ్లి... ముస్లిం లవర్ ముందు షాకిచ్చే డిమాండ్ ఉంచిన రాజస్థానీ హిందూ యువతి!

  • హిందూ మతం స్వీకరిస్తేనే వివాహం
  • మెజిస్ట్రేట్ ముందు స్టేట్ మెంట్ ఇచ్చిన పూజా జోషి
  • 'లవ్ జిహాద్' అంటూ దాడికి దిగిన యువతి బంధువులు
  • మేజర్లు కావడంతో నిర్ణయం వారిదేనన్న పోలీసులు

ఓ ముస్లిం యువకుడితో ప్రేమలో పడిన రాజస్థాన్ హిందూ యువతి పెళ్లికి తాను సిద్ధపడాలంటే, ప్రియుడు హిందూ మతంలోకి మారాల్సిందేనని షాకిచ్చే డిమాండ్ చేసింది. ఈ వార్త ఇప్పుడు భారత మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, జోధ్‌ పూర్ లో డిగ్రీ విద్యను అభ్యసిస్తున్న పూజా జోషి (20), మొహసిన్ ఖాన్ అనే ట్యాక్సీ డ్రైవరుతో ప్రేమలో పడింది. వీరిద్దరూ కలిసి ఎటో వెళ్లిపోయారు కూడా. పూజా కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, వీరిద్దరూ బికనీర్ లో ఉన్నారని గుర్తించిన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకుని జోధ్ పూర్ కు తీసుకొచ్చారు.

ఈ వ్యవహారం 'లవ్ జిహాద్' అంటూ పూజ బంధువులు మెహసీన్ పై దాడికి దిగగా, ఏసీపీ పూజా యాదవ్, ఆమెను మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లి, సీఆర్పీసీ సెక్షన్ 164 కింద ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. తన స్టేట్ మెంట్ లో, మొహ్సిన్ హిందూ మతాన్ని స్వీకరిస్తేనే తాను పెళ్లాడతానని, అతను మతం మారే వరకూ వేచి చూస్తానని చెబుతూ, ఇంటికి వెళ్లేందుకు మాత్రం నిరాకరించినట్టు తెలుస్తోంది. ఇక వీరిద్దరూ మేజర్లేనని, నిర్ణయాన్ని వారికే వదిలేశామని పోలీసులు తెలిపారు.

More Telugu News