raghu veera reddy: చంద్ర‌బాబు చెప్పేవి అస‌త్యాలు.. హైద‌రాబాద్‌ మెట్రోరైల్ ఘ‌న‌త మాదే!: ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి

  • ప్ర‌పంచంలో ఏ మంచి జ‌రిగినా తానే చేశాన‌ని చంద్ర‌బాబు అంటారు
  • చెడు జ‌రిగితే మాత్రం ప్ర‌తిప‌క్షాల ప‌నేన‌ని అంటారు
  • హైద‌రాబాద్‌పై చంద్ర‌బాబుకు మ‌మ‌కారం పోలేదు

మెట్రోరైల్ ప్రాజెక్టు గ‌త‌ కాంగ్రెస్ ప్ర‌భుత్వ ఘ‌న‌తేన‌ని ఏపీసీసీ అధ్య‌క్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఈ రోజు విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.... మెట్రో ప్రాజెక్టు ఘ‌న‌త త‌మ‌దేనంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌ప్పుడు ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని తెలిపారు.

ప్ర‌పంచంలో ఏ మంచి జ‌రిగినా తానే చేశాన‌ని, చెడు జ‌రిగితే మాత్రం ప్ర‌తిప‌క్షాల ప‌నేన‌ని అన‌డం చంద్ర‌బాబు నాయుడికి అల‌వాటుగా మారింద‌ని విమ‌ర్శించారు. హైద‌రాబాద్ వ‌దిలిపెట్టి వ‌చ్చిన‌ప్పటికీ చంద్ర‌బాబుకు ఆ న‌గ‌రంపై మ‌మ‌కారం పోలేద‌ని ర‌ఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. హైద‌రాబాద్‌కు మ‌ణిహారంగా నిలుస్తోన్న మెట్రోరైలు ప్రాజెక్టు కాంగ్రెస్ ప్ర‌భుత్వ కృషి వల్లే వ‌చ్చింద‌ని అంద‌రికీ తెలుస‌ని తెలిపారు.   

More Telugu News