septic tank: మాజీ ప్రియుడిని హ‌త‌మార్చి.. సెప్టిక్ ట్యాంక్‌లో ప‌డేసిన‌ యువ‌తి!

  • గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎన్టీఆర్‌ కరకట్ట వద్ద ఘ‌ట‌న‌
  • ఓ యువ‌కుడితో క‌లిసి దారుణానికి పాల్ప‌డిన యువ‌తి
  • మాజీ ప్రియుడితో వ‌చ్చిన విభేదాలే కారర‌ణం

త‌న మాజీ ప్రియుడిని హతమార్చి అత‌డి మృత‌దేహాన్ని సెప్టిక్‌ ట్యాంక్‌లో ప‌డేసింది ఓ యువ‌తి. ఈ దారుణ ఘ‌ట‌న గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎన్టీఆర్‌ కరకట్ట వద్ద చోటు చేసుకుంది. అందుకోసం ఆ యువ‌తి మ‌రో యువ‌కుడిని ఉప‌యోగించుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, గాయత్రి అనే యువ‌తి రాజయ్య అనే యువ‌కుడితో ప్రేమాయ‌ణం కొన‌సాగించింది.

అయితే, కొన్ని రోజులుగా వీరిద్ద‌రికీ ప‌డ‌డం లేదు. దీంతో మ‌రో యువ‌కుడితో స‌న్నిహితంగా ఉంటోన్న గాయ‌త్రి.. అత‌డితో క‌లిసి రాజ‌య్య‌ను ఇంట్లోనే చంపేసింది. సుధాక‌ర్ అనే యువ‌కుడితో క‌లిసి ఆమె ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు సమాచారం. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఎట్ట‌కేల‌కు సెప్టిక్ ట్యాంకులో మృతదేహాన్ని గుర్తించారు. ఈ కేసులో నిందితుల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News