upasana: టీవీలో క‌న‌ప‌డుతోన్న నన్ను మా మామ‌య్య‌, మిస్ట‌ర్ సీ ఫోటో తీసి పంపారు!: ఉపాస‌న హ‌ర్షం

  • హెచ్ఐసీసీలో జ‌రిగిన జీఈఎస్‌లో పాల్గొన్న ఉపాస‌న‌
  • మోదీ, ఇవాంక ట్రంప్ కూర్చున్న వ‌రస‌లోనే కూర్చున్న‌ ఉపాస‌న‌
  • ఆ ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ఉపాస‌న‌

ఈ రోజు హైద‌రాబాద్‌లోని హెచ్ఐసీసీలో జ‌రిగిన జీఈ స‌ద‌స్సుకు సినీన‌టుడు రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కూడా హాజ‌రైన విష‌యం తెలిసిందే. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, అమెరికా అధ్య‌క్షుడి స‌ల‌హాదారు ఇవాంక ట్రంప్‌లు ఈ స‌ద‌స్సులో మొద‌టి వరుసలో కూర్చోగా, వారి ప‌క్క‌నే ఉపాస‌న కూడా కూర్చొని అతిథులు ఇస్తోన్న ప్ర‌సంగాల‌ను ఆస‌క్తిగా విన్నారు.

ఈ నేప‌థ్యంలో తాను టీవీలో క‌న‌ప‌డుతుండ‌గా త‌న మామ‌య్య చిరంజీవి, భ‌ర్త రామ్ చ‌ర‌ణ్ తేజ్ ఆమె ఫొటోలను తీశార‌ట‌. ఆ ఫొటోను తనకు పంపార‌ని ట్విట్ట‌ర్ ద్వారా ఉపాస‌న తెలుపుతూ హ‌ర్షం వ్య‌క్తం చేసింది. మీరూ చూడండి...

More Telugu News