ivanka trump: ప్రధాని మోదీతో భేటీ అయిన ఇవాంకా ట్రంప్!

  • కాసేపట్లో గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ ప్రారంభం
  • హెచ్ఐసీసీలో మోదీతో భేటీ అయిన ఇవాంకా
  • ద్వైపాక్షిక అంశాలపై చర్చ

హైదరాబాదులోని హెచ్ఐసీసీలో 8వ గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కాసేపట్లో ప్రారంభం కానుంది. సదస్సు ప్రాంగణానికి ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ లు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ, ఇవాంకాలు హెచ్ఐసీసీలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై వీరు చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి ఇరు దేశాలకు చెందిన విదేశాంగ శాఖల ప్రతినిధులు హాజరయ్యారు. ఇవాంకా ఎంతో అభిమానించే భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా భేటీలో ఉన్నారు. 

More Telugu News