vishwaroopam: తిరిగి ప్రారంభ‌మైన క‌మ‌లహాస‌న్ 'విశ్వ‌రూపం 2' షూటింగ్‌

  • చివ‌రి షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొంటున్న న‌టీన‌టులు
  • డిసెంబ‌ర్‌లో ట్రైల‌ర్ విడుద‌ల‌
  • వ‌చ్చే ఏడాది ఆడియో

నాలుగేళ్లుగా ఆటంకాలు ఎదుర్కుంటున్న 'విశ్వ‌రూపం 2' చిత్ర షూటింగ్ ఇవాళ తిరిగి ప్రారంభ‌మైంది. చివ‌రి షెడ్యూల్ షూటింగ్‌లో భాగంగా చిత్ర‌యూనిట్ పాల్గొన‌బోతోంది. ఈ వారం రోజుల్లో సినిమాకు సంబంధించి టాకీ భాగం, ఇత‌ర ప‌నులు కూడా పూర్త‌వుతాయ‌ని చిత్ర‌యూనిట్ వెల్ల‌డించింది. దీంతో వ‌చ్చే నెల ట్రైల‌ర్‌, వ‌చ్చే ఏడాది ఆడియో విడుద‌ల అయ్యే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది.

నిజానికి క‌మ‌లహాస‌న్ పుట్టిన‌రోజైన న‌వంబ‌ర్ 7న ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కావాల్సి ఉంది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల కుద‌ర‌లేదు. అయితే 'విశ్వ‌రూపం' మొద‌టి భాగం స‌మ‌యంలో వ‌చ్చిన వివాదాల కార‌ణంగా ఈ చిత్ర షూటింగ్‌, విడుద‌ల‌లో జాప్యం జ‌రిగింది. మొద‌టి సినిమాతో పోల్చితే ఈ సినిమాలో చాలా ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు ఉంటాయ‌ని, సీనియ‌ర్ న‌టి వ‌హీదా రెహ‌మాన్ కూడా ఇందులో నటిస్తున్నట్టు గ‌తంలో క‌మ‌ల్ వెల్లడించిన సంగ‌తి తెలిసిందే.

More Telugu News