sridevi: సింగపూర్ రెస్టారెంట్ లో అందాల'బొమ్మ'గా మారిన శ్రీదేవి!

  • సింగపూర్ రెస్టారెంటులో శ్రీదేవి
  • అందమైన బొమ్మను చేయించి, పెట్టుకున్న యజమాని
  • సంతోషం వ్యక్తం చేసిన అతిలోక సుందరి

అతిలోక సుందరి శ్రీదేవికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. వయసు మీద పడుతున్నా ఆమెకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అలాంటి శ్రీదేవి సింగపూర్ లో ఉన్న ఓ రెస్టారెంటులో సంవత్సరం పొడవునా కస్టమర్లను అలరిస్తుంటుంది. అయితే, ఆమె నిజంగా శ్రీదేవి కాదు.. ఆమె ప్రతిమ! శ్రీదేవిని అమితంగా అభిమానించే ఆ రెస్టారెంట్ యజమాని శ్రీదేవి బొమ్మను రెస్టారెంటులో ఏర్పాటు చేశారు. ఆమెలా ఉన్న ఓ అందమైన బొమ్మను ప్రత్యేకంగా తయారు చేయించి, తన రెస్టారెంటులో పెట్టుకున్నారు.

ఈ విషయంపై శ్రీదేవి భర్త బోనీ కపూర్ స్పందిస్తూ, మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా శ్రీదేవికి ఎంతో మంది అభిమానులు ఉన్నారని చెప్పారు. ఆమెకు ఎంత స్టార్ డమ్ ఉందో చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ అని తెలిపారు. శ్రీదేవి మాట్లాడుతూ, ఈ విషయం తెలిసిన తర్వాత తనకు మాటలు రావడం లేదని అన్నారు. తన పేరును ఎంతో స్వీట్ గా వాడుకుంటున్నారని చెప్పారు. గత యాభై ఏళ్లుగా అభిమానులు తనపై చూపుతున్న అభిమానం వెలకట్టలేనిదని అని అన్నారు.
.

More Telugu News