Jagan: కర్నూలు లేక‌ అనంతపురం జిల్లా నుంచి ఒక ఎంపీ టికెట్‌ను బోయ‌ల‌కు కేటాయించిన జ‌గ‌న్‌!

  • కొన‌సాగుతోన్న జ‌గ‌న్ పాద‌యాత్ర‌
  • గోరంట్లలో బీసీ సంఘాల ప్ర‌తినిధుల‌తో జ‌గ‌న్ భేటీ
  • నేను చంద్ర‌బాబులా మోస‌పూరిత హామీలు ఇవ్వ‌బోను 
  • నా దృష్టికి వ‌స్తోన్న‌ ప్రతి సమస్యను పరిష్కరిస్తా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ రోజు క‌ర్నూలులోని గోరంట్లలో జ‌గ‌న్‌ బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశమ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... త‌దుప‌రి సార్వ‌త్రిక‌ ఎన్నికల్లో బోయలకు కర్నూలు లేక‌ అనంతపురం జిల్లా నుంచి ఏదో ఒక స్థానం నుంచి ఎంపీ టికెట్ ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. తాను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబులా మోసపూరిత హామీలు ఇవ్వబోన‌ని వ్యాఖ్యానించారు.

రానున్న కాలంలో ప్రతి జిల్లాలో బీసీ కమిటీలను ఏర్పాటు చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. పాదయాత్రలో త‌న‌ దృష్టికి వ‌స్తోన్న‌ ప్రతి సమస్యను తాను పరిష్కరిస్తాన‌ని జ‌గ‌న్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గ‌తంలో బీసీ సబ్‌ప్లాన్‌కు ఏడాదికి రూ.10 వేల కోట్లు ఇస్తామ‌ని చెప్పి, మాట త‌ప్పార‌ని ఆరోపించారు.  

More Telugu News