anasuya: జబర్దస్త్ 'అనాథాశ్రమం' స్కిట్ వివాదంపై స్పందించిన అనసూయ

  • లీడ్ కోసం అలాంటి డైలాగులు తీసుకున్నారు
  • ఎన్నో సమస్యలుండగా జబర్దస్త్ గురించి మాట్లాడటం ఎందుకు?
  • కేవలం నవ్వుకోవడానికే ఈ షో
  • ఫేస్ బుక్ లైవ్ చాట్ లో యాంకర్ అనసూయ

ఎంటర్ టెయిన్ మెంట్ రియాలిటీ షో జబర్దస్త్ లో ఇటీవల ప్రసారమైన 'అనాథాశ్రమం' స్కిట్ వివాదంపై యాంకర్ అనసూయ స్పందించింది. తెలుగు సినీ పరిశ్రమకు 'బాహుబలి' ఎలాంటిదో, టీవీ ఇండస్ట్రీకి 'జబర్దస్త్' అలాంటిదేనని చెప్పుకున్న అనసూయ, క్రియేటివిటీని చంపేయవద్దని ఫేస్ బుక్ మాధ్యమంగా అనసూయ కోరింది. వాళ్లు చేసిన స్కిట్ అలాంటిదని, అందరూ అనాథశ్రమంకి వెళ్లిన వేళ, అక్కడున్న వారిని ఉదేశించి లీడ్ కోసం అలాంటి డైలాగులు రాసుకున్నారే తప్ప, ఎవరినీ కించపరిచేందుకు కాదని, తమ ఉద్దేశం నవ్వించడమేనని చెప్పుకొచ్చింది.

ఫేస్ బుక్ లో అభిమానులతో లైవ్ చాట్ చేసిన ఆమె, జీవితంలో వచ్చే అన్ని అంశాలనూ తాము చూపిస్తున్నామని, నవ్విస్తున్న వాళ్లను ఏడిపించడం ఏమైనా బాగుందా? అని అనసూయ అడిగింది. సమస్యను గురించి ఆలోచిస్తే, క్రియేటివిటీ పోతుందని, లాజిక్స్ కోసం చూడకుండా నవ్వుకోవాలని సూచించింది. మాట్లాడుకోవాలంటే, అమ్మాయిలపై అత్యాచారాలు, విద్య, రహదారులు, కరెంట్ వంటి ఎన్నో అంశాలు ఉన్నాయని, వినోదాన్ని అందించే జబర్దస్త్ ను హైలైట్ చేయడం ఎందుకని అడిగింది. ఈ షో కోసం నాగబాబు, రోజా ఎంతో శ్రమిస్తున్నారని చెప్పుకొచ్చింది.

More Telugu News