airtel: ఎయిర్‌టెల్‌ రూ.198 తో కొత్త‌ ప్లాన్‌.. రోజుకు 1జీబీ 3జీ/4జీ డేటా!

  • ఎయిర్‌టెల్ మై యాప్ ద్వారా వినియోగించుకుంటోన్న యూజ‌ర్లు
  • 28 రోజుల వాలిడిటీ
  • వాయిస్ కాల్స్ మాత్రం లేవు 

టెలికాం రంగ దిగ్గ‌జ‌ సంస్థ ఎయిర్‌టెల్ మ‌రో ప్లాన్‌తో వినియోగ‌దారుల ముందుకు వ‌చ్చింది. ప్ర‌స్తుతం అందిస్తోన్న ప్లాన్ల‌ని అలాగే ఉంచి, రూ.198తో మరో ప్లాన్‌ను ప్ర‌క‌టించింది. ఎయిర్‌టెల్ మై యాప్ ద్వారా ఈ ప్లాన్‌ను వినియోగ‌దారులు ఉప‌యోగించుకోవచ్చు.

రూ.198తో రీచార్జి చేసుకుంటే రోజుకు 1జీబీ 3జీ/4జీ డేటా అందుకోవ‌చ్చు. ఈ ప్లాన్‌లో ఉచిత‌ వాయిస్‌ కాల్స్ మాత్రం అందుకోలేరు. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో ఉంటుంది. మార్కెట్‌లో రిల‌య‌న్స్‌ జియో ఇస్తోన్న పోటీతో దానికి దీటుగా ఎయిర్‌టెల్ ప్లాన్ల‌ను ప్ర‌క‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.  

More Telugu News