anil sahni: లాలూ కొడుకు చెంప పగులగొట్టిన వారికి కోటి రూపాయలు ఇస్తా!: బీజేపీ నేత సంచలన ప్రకటన

  • తేజ్ ప్రతాప్ యాదవ్ చెంప పగులగొట్టిన వారికి కోటి రూపాయల నజరానా
  • బీహార్ బీజేపీ మీడియా ఇన్ ఛార్జ్ అనిల్ సాహ్ని ప్రకటన 
  • లాలూ తన కుమారుల్ని అదుపులో పెట్టుకోవాలి

దేశ రాజకీయాల్లో దాడుల సీజన్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కొడుకు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ చెంప పగులగొట్టిన వారికి కోటి రూపాయల నజరానా ఇస్తానని బీహార్ బీజేపీ మీడియా ఇన్ ఛార్జ్ అనిల్ సాహ్ని ప్రకటించడం కలకలం రేపుతోంది. బీహార్ బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ అక్రమాలను బయటపెడతానని, ప్రజలందరి ముందు ఆయన చెంప పగులకొడతానని తేజ్ ప్రతాప్ యాదవ్ హెచ్చరించారు. అంతటితో ఆగని ఆయన డిసెంబర్ 3న సుశీల్ కుమార్ మోదీ కుమారుడు ఉత్కర్ష్ వివాహానికి ఆహ్వానం అందిందని, ఒకవేళ తాను దానికి హాజరైతే అక్కడ రచ్చరచ్చేనని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో... మోదీపై దాడి చేస్తానని తేజ్‌ చెప్పాడని, అతను దాడి చేయడానికి ముందే ఆయపై దాడి చేసిన వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇస్తామని అనిల్ సాహ్ని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలతో కలకలం రేగింది. దీంతో ఆయన వ్యాఖ్యలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, వీటిపై వివరణ కోరామని, ఆయన వివరణ సహేతుకంగా లేని పక్షంలో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పార్టీ ప్రకటించింది. ముందుగా లాలూ తన కుమారులను అదుపులో పెట్టుకోవాలని బీజేపీ సూచించింది.

More Telugu News