Kamal Haasan: కొత్త చిక్కుల్లో కమలహాసన్.. హిందువులను ఉగ్రవాదులు అన్నారంటూ కమల్ పై హైకోర్టులో కేసు!

  • హిందూ ఉగ్రవాదం అంటూ కమల్ వ్యాఖ్యలు
  • హిందువులను ఉగ్రవాదులు అన్నారంటూ పిటిషన్
  • విచారించదగ్గ అంశాలుంటే కేసు నమోదు చేయాలని హైకోర్ట్ ఆదేశం

మన దేశంలో హిందూ ఉగ్రవాదం ఉందంటూ ప్రముఖ నటుడు కమలహాసన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మద్రాస్ హైకోర్టులో ఆయనపై పిటిషన్ దాఖలైంది. తన వ్యాఖ్యల ద్వారా హిందువులపై ఉగ్రవాదులు అనే ముద్రను కమల్ వేశారంటూ పిటిషన్ దారుడు పేర్కొన్నారు.

హిందువులకు వ్యతిరేకంగా విషాన్ని వ్యాపింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రోజు హిందువులను ఉగ్రవాదులు అన్నారని... రేపు, ముస్లింలను లేదా క్రిస్టియన్లను ఉగ్రవాదులు అంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో కమల్ వ్యాఖ్యలపై హైకోర్టు స్పందించింది. కమల్ వ్యాఖ్యల్లో విచారించదగిన అంశాలుంటే కేసు నమోదు చేయాలని చైన్నై నగర పోలీసులను ఆదేశించింది.

More Telugu News