chai wala: న‌రేంద్ర మోదీని 'ఓ ఛాయ్ వాలా..' అంటూ సంబోధించిన బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా!

  • ఒక వకీల్ బాబు (అరున్ జైట్లీ) దేశ ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు
  • ఒక టీవీ నటి (స్మృతి ఇరానీ) కేంద్ర‌ మంత్రి అయ్యారు
  • అలాగే ఓ ఛాయ్ వాలా (న‌రేంద్ర మోదీ).... అంటూ ఏదో చెప్ప‌బోయిన సిన్హా ‌
  • దేశ ఆర్థిక ప‌రిస్థితిపై నేనెందుకు ప్ర‌శ్నించ‌వ‌ద్దు?

ఇటీవ‌ల భార‌తీయ జ‌న‌తా పార్టీ అధిష్ఠానంపైన, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపైన విమ‌ర్శలు చేసి, వార్తలలో నిలిచిన బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా గత కొన్ని రోజులుగా సైలెంట్ గా వుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మ‌రోసారి గ‌ళం విప్పారు.

ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకం ప్రారంభోత్సవానికి హాజరైన శత్రుఘ్న సిన్హా మాట్లాడుతూ.. ఒక వకీల్ బాబు (అరున్ జైట్లీ) దేశ ఆర్థిక శాఖ మంత్రి అయ్యాడ‌ని, ఒక టీవీ నటి (స్మృతి ఇరానీ) కేంద్ర‌ మంత్రి అయ్యార‌ని అన్నారు. అలాగే 'ఓ ఛాయ్ వాలా (న‌రేంద్ర మోదీ)....' అంటూ ఏదో చెప్ప‌బోయారు. కానీ, అంతలోనే మ‌రేం మాట్లాడ‌కుండా అక్క‌డితో ఆపేశారు. ఈ విషయం గురించి తాను పూర్తిగా మాట్లాడదల్చుకోలేదని అన్నారు. కానీ, తాను దేశ ఆర్థిక పరిస్థితులపై ఎందుకు మాట్లాడకూడదని ప్రశ్నించారు.

More Telugu News