somi reddy: దేశంలోని అవినీతి ప‌రుల్లో జ‌గ‌న్ ప‌దో స్థానంలో ఉన్నారు: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి సోమిరెడ్డి

  • వైసీపీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి జ‌గ‌న్ వైదొలగాలి
  • ప్ర‌తిప‌క్ష నేతగా ఉండే అర్హ‌త‌ జ‌గ‌న్‌కు లేదు
  • 12 కేసుల్లో జ‌గ‌న్ ముద్దాయిగా ఉన్నారు
  • పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ అర్థంలేని హామీలు ఇస్తున్నారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. ఈ రోజు నెల్లూరులో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ప్ర‌తిప‌క్ష నేతగా ఉండే అర్హ‌త‌ జ‌గ‌న్‌కు లేదని అన్నారు. 12 కేసుల్లో జ‌గ‌న్ ముద్దాయిగా ఉన్నారని ఆయ‌న అన్నారు. జ‌గ‌న్‌ ఎన్నో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని విమ‌ర్శించారు. 31 డొల్ల కంపెనీల ద్వారా జ‌గ‌న్ రూ.386 కోట్లు అక్ర‌మంగా మ‌ళ్లించారని, దేశంలోని అవినీతి ప‌రుల్లో ప‌దో స్థానంలో జ‌గ‌న్ ఉన్నారని సోమిరెడ్డి అన్నారు. పాద‌యాత్ర చేస్తూ అర్థంలేని హామీలు ఇస్తూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టాల‌ని చూస్తున్నార‌ని తెలిపారు.    

More Telugu News