elephant: ఏనుగుతో సెల్ఫీ కోసం ప్ర‌య‌త్నించి మృతి!

  • కోల్‌కతాలోని జల్‌పాయ్‌గురి జిల్లాలో ఘ‌ట‌న‌
  • ప‌ని ముగించుకుని ఇంటికి వెళ్తూ సెల్ఫీ తీసుకోబోయిన 40 ఏళ్ల‌ వ్య‌క్తి
  • తొండంతో దాడి చేసిన ఏనుగు

ప్ర‌మాద‌క‌ర ప్ర‌దేశాల్లో, జంతువుల‌తో సెల్ఫీలు దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సెల్ఫీల పిచ్చి ఈవేళ చిన్న పిల్ల‌ల‌నుంచి వృద్ధుల‌వ‌ర‌కు పాకేసింది. సెల్ఫీ మీద‌ మోజుతో ఏనుగు వ‌ద్ద‌కు వెళ్లిన 40 ఏళ్ల వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న పశ్చిమ బెంగాల్‌లో గురువారం చోటు చేసుకుంది.

కోల్‌కతాలోని జల్‌పాయ్‌గురి జిల్లాలో ఓ బ్యాంకుకు సెక్యూరిటీ గార్డ్‌గా ప‌నిచేస్తోన్న సాదిఖ్ అనే వ్య‌క్తి ప‌ని ముగించుకుని ఇంటికి వెళ్తోన్న స‌మ‌యంలో అటవీ ప్రాంతంలోని హైవేపై ఓ ఏనుగుని చూశాడు. సంతోషంతో దాని వ‌ద్ద‌కు వెళ్లి  త‌న మొబైల్‌తో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ ఏనుగు ఒక్కసారిగా తొండంతో దాడి చేయ‌డంతో మృతి చెందాడు.

More Telugu News