school: క‌దులుతోన్న బ‌స్సులో తోటి ప్ర‌యాణికుడిని చంపేసిన స్కూల్‌ విద్యార్థి!

  • బ‌స్సులో సెల్‌ఫోన్ పోగొట్టుకున్న ప్ర‌యాణికుడు
  • విద్యార్థుల బ్యాగుల్లో వెతికిన వైనం
  • కోపం తెచ్చుకున్న విద్యార్థులు
  • నిందితుల కోసం గాలిస్తోన్న ఢిల్లీ పోలీసులు

స్కూల్ యూనిఫాంలో ఉన్న కొంత మంది యువ‌కులు బ‌స్సు ఎక్కి, ఓ వ్య‌క్తితో గొడ‌వ పెట్టుకుని పొడిచి చంపేసిన ఘ‌ట‌న దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. మధుర రోడ్డులో నిన్న‌ మధ్యాహ్నం స్థానిక ఆశ్రమం వద్ద బస్సు ఆగినప్పుడు స‌ద‌రు యువ‌కులు ఎక్కారు. వారితో పాటు మ‌రో ప్ర‌యాణికుడు కూడా ఎక్కాడు. కాసేప‌టి త‌రువాత ఆ ప్ర‌యాణికుడి ఫోన్‌ పోయింది. దీంతో బాధితుడు స‌ద‌రు యువ‌కుల బ్యాగుల్లో వెతికాడు. దీంతో కోపం తెచ్చుకున్న విద్యార్థులు ఆ వ్యక్తితో గొడ‌వ‌పెట్టుకున్నారు.

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఓ విద్యార్థి తన వద్ద ఉన్న కత్తిని తీసి ఆ వ్యక్తి మెడలో పొడ‌వ‌డంతో అత‌డు మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న‌తో ఆ విద్యార్థులంతా బ‌స్సు నుంచి దూకి పారిపోయారు. నిందితుల దుస్తులను చూస్తుంటే వారు స్థానిక ప్ర‌భుత్వ పాఠశాల విద్యార్థుల్లా ఉన్నార‌ని ఆ బ‌స్సు కండ‌క్ట‌ర్ తెలిపాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.  

More Telugu News