BANDLA GANESH: చెక్ బౌన్స్ కేసులో.. బండ్ల గణేష్ కు ఆరునెలల జైలు శిక్ష, భారీ జరిమానా!

  • చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు జైలు శిక్ష
  • 15 లక్షల 86వేల 550 రూపాయల జరిమానా
  • తీర్పును వెలువరించిన ఎర్రమంజిల్ కోర్టు


సినీ నిర్మాత బండ్ల గణేష్ కు హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆరు నెలల జైలు శిక్షను విధించింది. జైలు శిక్షతో పాటు 15లక్షల 86వేల 550 రూపాయల జరిమానా విధించింది. ఓ చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు ఈ శిక్షను విధించింది.

వివరాల్లోకి వెళ్తే, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' సినిమాకు వక్కంతం వంశీ రచయితగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో, తనకు నిర్మాత బండ్ల గణేష్ చెల్లని చెక్ ఇచ్చారంటూ వక్కంతం వంశీ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఈ రోజు తీర్పును వెలువరించింది. తీర్పు అనంతరం, బండ్ల గణేష్ బెయిల్ కు దరఖాస్తు పెట్టుకోగా... జడ్జి బెయిల్ మంజూరు చేశారు. 

More Telugu News