second test: ఫస్ట్ స్లిప్ లో పుజారా అద్భుత విన్యాసం.. తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక

  • సమరవిక్రమను పెవిలియన్ చేర్చిన ఇషాంత్
  • అద్భుతమైన క్యాచ్ పట్టిన పుజరా
  • 20 పరుగుల వద్ద తొలి వికెట్

నాగపూర్ లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో 20 పరుగుల వద్ద ఓపెనర్ సమరవిక్రమ (13 పరుగులు, 15 బంతులు, 1 ఫోర్) ను ఇషాంత్ శర్మ పెవిలియన్ చేర్చాడు. 139 కిలోమీటర్ల వేగంతో ఇషాంత్ సంధించిన ఫుల్ డెలివరీ ఔట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వైపు స్వింగ్ అయింది. ఆ బంతిని మిడ్ ఆఫ్ మీదుగా సమరవిక్రమ ఆడబోగా, బంతి ఎడ్జ్ తీసుకుంది. ఫస్ట్ స్లిప్ వైపు వెళ్లిన బంతిని పుజారా ఎడమవైపుకు అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ ను అందుకున్నాడు. దీంతో శ్రీలంక పతనం ఆరంభమైంది. మరో వైపు, కరుణరత్నే 7 పరుగులతో ఆడుతున్నారు. తిరిమన్నే క్రీజులోకి వచ్చాడు. 

More Telugu News