Shriya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • మంచి పుస్తకాలు కావాలంటున్న శ్రియ
  • ఎట్టకేలకు విడుదలవుతున్న 'ఆక్సిజన్'
  • 'జవాన్' సెన్సార్ పూర్తి.. డిసెంబర్ 1న విడుదల 
  • కల్యాణ్ రామ్ చిత్రానికి అమెరికాలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు   

*  'మీరీ మధ్య మంచి పుస్తకం ఏదైనా చదివితే కాస్త నాక్కూడా చెప్పండి' అంటోంది అందాలతార శ్రియ. ఈ అమ్మడు షాట్ గ్యాప్ లో ఎక్కువగా ఏదో ఒక పుస్తకం చదువుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. అందుకే, ఇటీవల వచ్చిన జీవిత కథలు, హిస్టరీకి చెందిన స్ఫూర్తిదాయకమైన పుస్తకాలు వుంటే చెప్పమని శ్రియ అభిమానులను అడుగుతోంది.    
*  గోపీచంద్ హీరోగా రూపొందిన 'ఆక్సిజన్' చిత్రం వాయిదాల మీద వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ నెల 30న విడుదల కానుంది. ఇందుకు సంబంధించి నిర్మాత ప్రకటన ఇచ్చారు. ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రాశిఖన్నా, అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటించారు.
*  సాయిధరం తేజ్ హీరోగా బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపొందిన 'జవాన్' చిత్రానికి సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ లభించింది. దీంతో డిసెంబర్ 1న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో మెహ్రీన్ కథానాయికగా నటించింది.
*  నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కోసం తాజాగా ఓ పాటను చిత్రీకరించారు. కల్యాణ్ రామ్, తమన్నాలపై చిత్రీకరించిన ఈ పాటకు బృంద మాస్టర్ నృత్యాలను సమకూర్చారు. మరోపక్క అమెరికాలోని లాస్ ఏంజెలస్, షికాగోలలో చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.     

More Telugu News