hicc: సందిగ్ధ‌త‌కు తెర‌... హైద‌రాబాద్‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఖ‌రారు!

  • ఈ నెల 28న హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న మొద‌లు
  • బేగంపేట నుంచి మియాపూర్‌కు హెలికాప్ట‌ర్‌లో వెళ్ల‌నున్న ప్ర‌ధాని
  • మియాపూర్ నుంచి కూక‌ట్‌ప‌ల్లి వ‌ర‌కు మెట్రోరైలులో ప్ర‌యాణించ‌నున్న మోదీ
  • అనంతరం హెచ్ఐసీసీకి

సందిగ్ధ‌త‌కు తెర ప‌డింది. ఈ నెల 28 ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ హైద‌రాబాద్ మెట్రోరైల్ తొలిద‌శ‌ను ప్రారంభిస్తారా? లేదా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వ‌చ్చింది. హైద‌రాబాద్‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఖ‌రారైంది. ఈ నెల 28న మ‌ధ్యాహ్నం 2.30కు ప్ర‌ధాని మోదీ బేగంపేట విమానాశ్ర‌యం చేరుకోనున్నారు. బేగంట‌పేట నుంచి మియాపూర్‌కు హెలికాప్ట‌ర్‌లో వెళతారు.

మియాపూర్‌లో మెట్రోరైల్ పైలాన్‌ను ప్రారంభించి, అనంత‌రం మియాపూర్ నుంచి కూక‌ట్‌ప‌ల్లి వ‌ర‌కు మెట్రోరైలులో ప్ర‌యాణిస్తారు. తిరిగి అందులోనే కూక‌ట్‌ప‌ల్లి నుంచి మియాపూర్ వెళ‌తారు. మియాపూర్ నుంచి హెచ్ఐసీసీకి హెలికాప్ట‌ర్‌లో వెళతారు. హెచ్ఐసీసీలో జ‌ర‌గ‌నున్న‌ ప్ర‌పంచ వ్యాపార‌వేత్త‌ల స‌ద‌స్సులో ఇవాంకా ట్రంప్‌, తెలంగాణ‌ సీఎం కేసీఆర్‌తో క‌లిసి పాల్గొంటారు. ఇందుకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.    

More Telugu News