air asia: విశాఖలో ఎయిర్‌ ఏసియా విమానంలో సాంకేతికలోపం.. ఆందోళ‌న‌కు దిగిన ప్ర‌యాణికులు

  • బెంగ‌ళూరు వెళ్లేందుకు వ‌చ్చిన ప్ర‌యాణికులు
  • ప్ర‌యాణికుల్లో అయ్య‌ప్ప భ‌క్తులు
  • బెంగ‌ళూరు నుంచి మ‌రో విమానంలో కోచి వెళ్లాలనుకున్న ప్ర‌యాణికులు
  • విమానం ఆల‌స్యం కావడంతో ఆందోళ‌న‌

విశాఖప‌ట్నం ఎయిర్‌పోర్టులో ప్ర‌యాణికులు ఆందోళ‌న‌కు దిగారు. ఈ రోజు ఉద‌యం 11 గంట‌ల‌కు విశాఖ‌ప‌ట్నం నుంచి బెంగ‌ళూరుకు వెళ్లాల్సిన ఎయిర్‌ ఏసియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆల‌స్యం అయింది. ప్రయాణికుల్లో 23 మంది అయ్యప్ప భక్తులు కూడా ఉన్నారు. విశాఖ‌ప‌ట్నం నుంచి వారు విమానంలో బెంగళూరుకి చేరుకొని, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మ‌రో విమానంలో కోచి వెళ్లాల్సి ఉంది. విశాఖ‌ప‌ట్నంలోనే స‌మ‌యం వృథా కావ‌డంతో తాము బెంగ‌ళూరులోని కోచి విమానాన్ని కూడా వ‌దులుకోవాల్సి వ‌స్తుంద‌ని ప్ర‌యాణికులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చివ‌ర‌కు ఆ విమానం బెంగ‌ళూరుకి ఆల‌స్యంగా బ‌య‌లుదేరిన‌ట్లు తెలుస్తోంది.  

More Telugu News