metro rail: ఈ నెల 29 నుంచి మెట్రో రైలు కార్యకలాపాలు కొనసాగుతాయి: మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

  • అన్ని ప‌నులు పూర్తి
  • ఈ నెల 28న మెట్రోరైల్ తొలిద‌శ ప్రారంభం
  • మొదటి ఆరు నెలలు తక్కువ సంఖ్యలో మెట్రోరైళ్లు న‌డుస్తాయి

హైద‌రాబాద్ మెట్రో రైల్ తొలిద‌శ‌ ఈ నెల 28న ప్రారంభం అవుతుందా? లేదా? అన్న సందిగ్ధ‌త నెల‌కొన్న విష‌యం తెలిసిందే. కానీ, అదే రోజున మెట్రో రైల్ ప్రారంభోత్స‌వం చేసితీరాలని అధికారులు పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రోజు మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ... మెట్రో రైలు ప్రారంభానికి పూర్తి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ నెల 28న మెట్రో రైలు ప్రారంభం ఉంటుందని స్ప‌ష్టం చేశారు.

ఇక 29 నుంచి మెట్రో రైలు కార్యకలాపాలు కొనసాగుతాయని, మొదటి ఆరు నెలలు తక్కువ సంఖ్యలో మెట్రోరైళ్లు నడుస్తాయని చెప్పారు. మ‌రోవైపు హైద‌రాబాద్ మెట్రోరైల్ ప్రారంభోత్స‌వానికి ఈ నెల 28న రావాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి హ‌ర్‌దీప్ సింగ్‌ని మంత్రి కేటీఆర్ ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. 

More Telugu News