rail: రైలు కింద దూరి అవతలకు వెళ్లే ప్రయత్నం.. అంతలోనే కదిలిన రైలు.. బతికిపోయిన వైనం!

  • ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని దేవరియా రైల్వేస్టేషన్‌లో ఘ‌ట‌న‌
  • తాను ఎక్కాల్సిన రైలు అవతలి ప్లాట్‌ ఫాంపై ఉండటాన్ని గ‌మ‌నించిన వ్యక్తి
  • పట్టాలను దాటేందుకు అడ్డుగా ఉన్న గూడ్స్‌ రైలు కింద నుంచి దూరిన వైనం
  • క‌దిలిన గూడ్సు రైలు.. అయినప్ప‌టికీ త‌ప్పిన ప్ర‌మాదం

తనపైనుంచి రైలు వెళ్లనుందన్న విషయం తెలుసుకున్న ఓ ప్ర‌యాణికుడు రైల్వే ట్రాక్‌పై ప‌డుకున్నాడు. అదృష్ట‌వ‌శాత్తూ అత‌డిపై నుంచి రైలు వెళ్లినా అతనికి ఎటువంటి గాయాలూ కాలేదు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన‌ ఓ వ్యక్తి దేవరియా రైల్వే స్టేష‌నుకి వ‌చ్చి, తాను ఎక్కాల్సిన రైలు అవతలి ప్లాట్‌ ఫాంపై ఉండటాన్ని గ‌మ‌నించాడు. అయితే, ఆ రైలు వెళ్లిపోతోంద‌ని తెలుసుకుని పట్టాలను దాటేందుకు మధ్యలో అడ్డుగా ఉన్న గూడ్స్‌ రైలు కింద నుంచి దూరి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించాడు.

అదే స‌మ‌యంలో ఆ గూడ్స్‌ రైలు ఒక్క‌సారిగా కదలడంతో.. చటుక్కున ఆ రైలు కిందే పట్టాల మధ్య ప‌డుకున్నాడు. ఈ విష‌యాన్ని గుర్తించిన అక్క‌డి ఇత‌ర‌ ప్ర‌యాణికులు ఆ వ్య‌క్తి చ‌నిపోయి ఉంటాడ‌ని అనుకున్నారు. కానీ, త‌న‌పై నుంచి రైలు వెళ్లిన అనంత‌రం ఎంచ‌క్కా లేచి ప‌ట్టాల‌ను దాటుకుంటూ అతను వెళ్లిపోవడంతో అందరూ మృత్యుంజయుడంటూ కామెంట్ చేశారు.


More Telugu News