BJP: బీజేపీ అగ్రనేతలు, ప్రముఖ ముఖ్యమంత్రుల హత్యే లక్ష్యం.. ఇప్పటికే భారత్ లో ప్రవేశించిన ఉగ్రమూక!

  • రంగంలోకి జైషే మహ్మద్, లష్కరే తాయిబా
  • ఇప్పటికే భారత్ లో ప్రవేశించిన ముష్కరులు
  • కుట్ర వెనుక మౌలానా మసూద్ అజార్

బీజేపీ అగ్రనేతలు, సీనియర్ నేతలు, ప్రముఖ ముఖ్యమంత్రులను పాక్ భూభాగం నుంచి పనిచేస్తున్న జైషే మహ్మద్, లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థలు టార్గెట్ చేశాయని ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చాయి. ఈ కుట్ర వెనుక జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ఉన్నాడని ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ కు సంబంధించి ఇప్పటికే కొందరు ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించారు. తొలి టార్గెట్ గా వీరు ఓ ప్రముఖ బీజేపీ ముఖ్యమంత్రిని ఎంచుకున్నట్టు సమాచారం. ఈ ముఖ్యమంత్రి తక్కువ భద్రతతో తిరుగుతుంటారట.

ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్ అధికారుల సహాయంతో ఢాకాలోని ఓ అనుమానిత ప్రదేశంపై మన ఇంటెలిజెన్స్ అధికారులు రైడ్ చేశారు. అయితే, అక్కడ ఎలాంటి సమాచారం దొరకలేదని ఓ అధికారి తెలిపారు. మసూద్ అజార్ మేనల్లుడు తహ్లా రషీద్ కాల్చివేతకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టారనే సమాచారం ఉందని అధికారులు తెలిపారు.

More Telugu News