global entrepreneurship summit: ఇవాంకా హైదరాబాదు సదస్సుకు పాకిస్థాన్ పారిశ్రామిక వేత్తలు!

  • హైదరాబాదులో ఈ నెల 28 నుంచి 30 వరకు జరగనున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్
  • ముఖ్య అతిథిగా ఇవాంకా ట్రంప్
  • ఈ సదస్సుకి హాజరుకానున్న పాక్ పారిశ్రామిక వేత్తలు

హైదరాబాదులో ఈ నెల 28 నుంచి 30 వరకు జరగనున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ కు పాకిస్థాన్ పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన ప్రత్యేక సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు పాల్గొననున్నారు. ఇందులో పాకిస్థాన్ కు చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్నారని తెలుస్తోంది. అయితే పాకిస్థాన్ కు చెందిన ఆ పారిశ్రామిక వేత్తలు ఎవరు? ఎంతమంది ఈ సదస్సులో పాల్గొంటారు? వంటి వివరాలు బయటకు తెలియలేదు. 

More Telugu News