yogi aditya: న‌జ‌రానా ఇస్తామని ప్రకటిస్తున్న వారు చేస్తున్నది తప్పయితే.. భన్సాలీ చేసిందీ త‌ప్పే!: 'పద్మావతి' వివాదంపై యూపీ సీఎం

  • ప‌ద్మావ‌తి సినీ బృందంపై వ‌స్తోన్న హెచ్చ‌రిక‌ల‌పై స్పందించిన యోగి
  • మా రాష్ట్రంలోని 22 కోట్ల మంది సెంటిమెంట్లను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి
  • అభ్యంతరాలను చెబుతూ ఇప్పటికే కేంద్ర ప్ర‌భుత్వానికి కూడా లేఖ రాశాము

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన 'ప‌ద్మావ‌తి' సినిమాపై వివాదాస్పద వ్యాఖ్య‌లు కొన‌సాగుతున్నాయి. ఏకంగా ప‌లు రాష్ట్రాల సీఎంలు కూడా ఈ సినిమాపై వ్యాఖ్యలు చేస్తోన్న విష‌యం తెలిసిందే. తాజాగా ప‌ద్మావ‌తి సినిమా గురించి స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ మాట్లాడుతూ.. భ‌న్సాలీ త‌ల తేవాల‌ని కొంద‌రు న‌జ‌రానా ప్ర‌క‌టించిన విష‌యాన్ని ప్రస్తావించారు. అలా హెచ్చ‌రిక చేయ‌డం త‌ప్ప‌యితే, భ‌న్సాలీ చేసింది కూడా త‌ప్పేన‌ని వ్యాఖ్యానించారు.

ఈ సినిమా విష‌యంలో త‌మ రాష్ట్రంలో ఉన్న 22 కోట్ల మంది సెంటిమెంట్లను సెన్సార్ బోర్డు పరిగణనలోకి తీసుకోవాలని ఆయ‌న కోరారు. తాము త‌మ అభ్యంతరాలను చెబుతూ ఇప్పటికే కేంద్ర ప్ర‌భుత్వానికి కూడా లేఖ రాశామ‌ని తెలిపారు. అయితే, యోగి చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు ఖండిస్తున్నారు.

More Telugu News