youngster: త‌న‌కు న‌చ్చ‌ని పిల్ల‌నిచ్చి పెళ్లి చేస్తున్నారంటూ ఉరి వేసుకున్న‌ యువ‌కుడు

  • మధ్యప్రదేశ్ వర్తూరు సమీపంలోని ముళ్లూరులో ఘ‌ట‌న‌
  • పెళ్లి కూతురి ఫొటోను పంపిన త‌ల్లిదండ్రులు
  • అమ్మాయి న‌చ్చ‌లేద‌ని చెప్పినా వినిపించుకోని వైనం
  • తీవ్ర ఒత్తిడికి గురైన యువ‌కుడు

త‌న‌కు న‌చ్చ‌ని అమ్మాయిని పెళ్లి చేసుకోవాల‌ని త‌ల్లిదండ్రులు ఒత్తిడి తీసుకువ‌స్తుండ‌డం‌తో ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అజయ్ (23) అనే యువ‌కుడు ఉపాధి కోసం వర్తూరు సమీపంలోని ముళ్లూరులో నివ‌సిస్తున్నాడు. ఆ యువ‌కుడికి పెళ్లి చేయాల‌ని భావించిన తల్లిదండ్రులు ఓ సంబంధం చూసి, పెళ్లి కూతురి ఫొటోను పంపారు.

అయితే, అజ‌య్‌కు ఆమె న‌చ్చ‌లేదు. దీంతో ఈ విష‌యాన్ని త‌ల్లిదండ్రుల‌కు చెప్పాడు. అయిన‌ప్పటికీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల‌ని త‌ల్లిదండ్రులు అన‌డంతో ఆ యువ‌కుడు కుమిలిపోయాడు. తీవ్ర ఒత్తిడికి గురై ముళ్లూరు గ్రామ సమీపంలోని నీలగిరి తోటలో చెట్టుకు ఊరివేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

More Telugu News