raja singh: తెలంగాణ‌లో 'ప‌ద్మావ‌తి' సినిమాను నిషేధించాలంటూ హైద‌రాబాద్‌లో ర్యాలీ!

  • బేగంబజార్‌ నుంచి హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వరకు ర్యాలీ
  • బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
  • రాజాసింగ్ స‌హా ఆయ‌న అనుచ‌రులు అరెస్టు
  • రాణి పద్మావతి చరిత్రను వక్రీకరించార‌ని ఆరోప‌ణ

దీపికా ప‌దుకునే, షాహిద్ క‌పూర్, ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ప‌ద్మావ‌తి సినిమా వివాదాల్లో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాను విడుద‌ల చేస్తే థియేట‌ర్ల‌ను త‌గుల‌బెడ‌తామ‌ని ఇప్ప‌టికే హెచ్చ‌రించిన హైద‌రాబాద్ గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మ‌రోసారి త‌మ డిమాండ్ గురించి మాట్లాడారు. ఈ సినిమాను తెలంగాణ‌ వ్యాప్తంగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్‌ బేగంబజార్‌లోని భూలక్ష్మి దేవాలయం నుంచి హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీ కొన‌సాగుతుండ‌గా రాజాసింగ్‌తోపాటు ఆయన అనుచరులను అడ్డుకున్న పోలీసులు, వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ  సందర్భంగా రాజా సింగ్ మాట్లాడుతూ...  రాణి పద్మావతి చరిత్రను వక్రీకరించి చూపిస్తే క్షత్రియుల మనోభావాలు దెబ్బతింటాయ‌ని అన్నారు. సీఎం కేసీఆర్ వెంట‌నే స్పందించి ఈ సినిమాపై నిషేధం విధించాల‌ని డిమాండ్ చేశారు.   

More Telugu News