Jagan: మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చిన తరువాత మీరు చేయాల్సింది ఒక్క‌టే!: ప్రజలతో జ‌గ‌న్

  • మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చాక మీ పిల్లల్ని నేను చ‌దివిస్తా
  • మీ అంద‌రి పిల్ల‌ల్ని బ‌డుల‌కు పంపించండి
  • డాక్ట‌ర్ చ‌దవాల‌న్నా, ఇంజ‌నీరింగ్ చ‌దవాల‌న్నా నేను తోడుంటా
  • భ్ర‌ష్టు ప‌ట్టిన ఆరోగ్య‌శ్రీని మ‌ళ్లీ స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపిస్తాను

త‌మ‌ ప్ర‌భుత్వం వ‌చ్చాక అంద‌రు పిల్లల్ని ఉన్న‌త చ‌దువులు చ‌దివిస్తాన‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏపీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ రోజు క‌ర్నూలు జిల్లా బేతంచ‌ర్ల‌లో పాద‌యాత్ర కొన‌సాగించిన జ‌గ‌న్.. అక్క‌డ ర్యాలీలో మాట్లాడారు. త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చిన తరువాత ప్ర‌జ‌లు చేయాల్సింది ఒక్క‌టేన‌ని, అదేమిటంటే, ఆయా త‌ల్లిదండ్రులు వారి పిల్ల‌ల్ని బ‌డుల‌కు పంపించడమేనని అన్నారు. డాక్ట‌ర్ చ‌దవాల‌న్నా, ఇంజ‌నీరింగ్ చ‌దవాల‌న్నా తాను తోడుంటాన‌ని తెలిపారు. అలాగే భ్ర‌ష్టు ప‌ట్టిన ఆరోగ్య‌శ్రీని మ‌ళ్లీ స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపిస్తానని తెలిపారు.

ఏ రోగానికైనా స‌రే ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా వైద్యం చేయిస్తానని తెలిపారు. త‌మ‌ ఎన్నిక‌ల ప్ర‌ణాళిక కేవ‌లం 2, 3 పేజీలే ఉంటుందని అన్నారు. ఆ ఎన్నిక‌ల మానిఫెస్టో ప్ర‌జ‌లు ఏది చెబితే అదే విధంగా ఉంటుందని అన్నారు. మానిఫెస్టోలో ఏది చెబుతామో అవ‌న్నీ చేసి చూపిస్తామ‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు.

విశ్వ‌స‌నీయ‌త అనే ప‌దానికి మ‌రోసారి అర్థం ఏంటో చూపిస్తామ‌ని అన్నారు. 104 ద్వారా అన్ని ర‌కాల మందులు ఇస్తామ‌ని తెలిపారు. మీ అమూల్య‌మైన సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వండ‌ని ప్ర‌జ‌ల‌ను జ‌గ‌న్ కోరారు. చంద్ర‌బాబు నాయుడు నిరుద్యోగుల‌కు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వ‌డం లేదని తెలిపారు. చంద్ర‌బాబు అన్ని కులాల వారినీ మోసం చేశార‌ని అన్నారు.

More Telugu News