BJP: మోదీని వేలెత్తి చూపే వారి వేళ్లు నరికేస్తాం: బీజేపీ ఎంపీ

  • బీజేపీ బీహార్‌ అధ్యక్షుడు, ఎంపీ నిత్యానంద రాయ్ హెచ్చ‌రిక‌
  • మోదీ పేదరికాన్ని జయించి ప్రధానమంత్రి అయ్యారు
  • ఆయ‌న‌ను ఏమైనా అంటే నరక‌డానికి కూడా వెనుకాడబోము
  • మోదీ రూపంలో స్వామి వివేకానంద మళ్లీ పుట్టారు

దేశంలో ఎక్కడో ఓ చోట ప్రతి రోజూ భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు ఎవరో ఒకరు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బీజేపీ బీహార్‌ అధ్యక్షుడు, ఎంపీ నిత్యానంద రాయ్ అనుచిత వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లోకెక్కారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వేలెత్తి చూపినా, చెయ్యెత్తి చూపినా వాటిని నరికేస్తామని హెచ్చ‌రించారు. న‌రేంద్ర‌ మోదీ పేదరికాన్ని జయించి ప్రధానమంత్రి అయ్యారని అన్నారు.

మోదీని ఏమైనా అంటే నరక‌డానికి కూడా వెనుకాడబోమని హెచ్చ‌రించారు. మోదీ రూపంలో స్వామి వివేకానంద మళ్లీ పుట్టారని వ్యాఖ్యానించారు. నిత్యానంద చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు విమ‌ర్శ‌ల దాడి మొద‌లుపెట్టారు.

More Telugu News