raviteja: సంక్రాంతికే వచ్చేస్తానంటోన్న 'టచ్ చేసి చూడు'

  • హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ 
  • ఇప్పటికి 60 శాతం షూటింగ్ పూర్తి
  • జనవరి 13న భారీస్థాయి విడుదల
  • పవన్ .. బాలకృష్ణ సినిమాలతో పోటీ

రవితేజ కథానాయకుడిగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు' సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. రాశి ఖన్నా .. శీరత్ కపూర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 60 శాతానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మాస్ .. యూత్ .. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.

 ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. డిసెంబర్ నాటికి అన్ని పనులను పూర్తి చేసుకుని, జనవరి 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు. జనవరి 10న 'అజ్ఞాతవాసి' .. 12న 'జై సింహా' ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. గట్టిపోటీ ఉన్నప్పటికీ రవితేజ రంగంలోకి దిగేస్తున్నాడన్న మాట.     

More Telugu News