Keerthi Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • దిల్ రాజు బ్యానర్లో కీర్తి సురేష్ 
  • ఎన్టీఆర్ వర్ధంతికి ఫస్ట్ లుక్ 
  • 'మెంటల్ మదిలో' ప్రీ రిలీజ్ ఫంక్షన్ 
  • భారీ రేటుకి 'సువర్ణ సుందరి' హిందీ శాటిలైట్ హక్కులు  

*  అందాలతార కీర్తి సురేష్ త్వరలో యంగ్ హీరో రామ్ సరసన నటించనుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రామ్ హీరోగా దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయికగా కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తాడు.  
*  మహానటుడు దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తున్న సంగతి విదితమే. ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇదిలా ఉంచితే, ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఎన్టీఆర్ వర్ధంతి రోజైన జనవరి 18న విడుదల చేయనున్నట్టు సమాచారం.
*  వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు, నివేదా పేతురాజ్ జంటగా రాజ్ కందుకూరి నిర్మించిన 'మెంటల్ మదిలో' చిత్రం ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిన్న రాత్రి హైదరాబాదులో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.    
*  పెద్ద తారలు లేకుండా కథాబలమున్న చిత్రంగా రూపొందుతున్న 'సువర్ణసుందరి' చిత్రానికి హిందీ శాటిలైట్ హక్కులు బాగా పలికినట్టు సమాచారం. సుమారు కోటి రూపాయలకు ఈ హక్కులు అమ్ముడైనట్టు చెబుతున్నారు. సూర్య ఎమ్మెస్సెన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.    

More Telugu News