lord rama: రాముడి కంటే కృష్ణుడిని ఎక్కువ మంది పూజిస్తారు!: ములాయం సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

  • రాముడిని కేవలం ఉత్త‌ర భార‌తీయులే కొలుస్తారు
  • కృష్ణుడిని విదేశాల్లో కూడా పూజిస్తారు
  • కొత్త వివాదానికి తెర‌తీసేలా ఉన్న ములాయం వ్యాఖ్య‌లు

ఇప్ప‌టికే మ‌తం ముసుగులో రాజ‌కీయాలు భ్ర‌ష్టుప‌డుతుంటే మ‌రో సంచ‌ల‌నానికి దారి తీసే వ్యాఖ్య‌ల‌ను స‌మాజ్‌వాదీ నాయ‌కుడు ములాయం సింగ్ చేశాడు. హిందూ దేవుళ్ల‌లో రాముడి కంటే కృష్ణుడినే ఎక్కువ మంది పూజిస్తారంటూ ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. రాముడిని కేవ‌లం ఉత్త‌ర భార‌తంలో మాత్ర‌మే కొలుస్తారని, అదే కృష్ణుడిని భార‌త‌దేశంతో పాటు విదేశాల్లో కూడా కొలుస్తారని ఆయ‌న పేర్కొన్నారు.

'ద‌క్షిణాదిలో రాముడి కంటే కృష్ణుడినే ఎక్కువ పూజిస్తారు. రాముడు దేవుడే, కానీ ఆయ‌నను కొలిచే వారికంటే ఎక్కువ మంది కృష్ణుడిని కొలుస్తార‌నే విష‌యం అంగీక‌రించాల్సిందే. కృష్ణుడిని ఇక్క‌డే కాదు, విదేశాల్లోనూ పూజిస్తారు' అని అన్నారు. ములాయం చేసిన ఈ వ్యాఖ్య‌లు కొత్త వివాదానికి దారితీసే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

More Telugu News