sai pallavi: ఆక‌ట్టుకుంటున్న 'క‌ణం' ట్రైల‌ర్‌... న‌ట‌న‌తో మ‌రోసారి మెప్పించేందుకు సిద్ధ‌మైన సాయి ప‌ల్ల‌వి

  • ఇదే సినిమాతో త‌మిళ సినిమాలో తెరంగేట్రం
  • హీరోగా నాగ‌శౌర్య‌
  • ఇప్ప‌టికే విడుద‌లైన ఎంసీఏ టీజ‌ర్‌

భానుమ‌తి పాత్ర‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచేసిన సాయి ప‌ల్ల‌వి, ఈసారి థ్రిల్లింగ్‌కి గురి చేసే లేడీ ఓరియెంటెడ్ హార‌ర్ సినిమాతో రాబోతోంది. క‌ణం పేరుతో రానున్న ఈ చిత్ర ట్రైల‌ర్ ఇటీవ‌ల విడుద‌లైంది. భ్రూణహ‌త్య క‌థాంశంగా తెర‌కెక్కిన ఈ చిత్ర ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. 'ఫిదా'లో తెలంగాణ యాస‌లో మాట్లాడిన సాయి ప‌ల్ల‌వి, ఈ చిత్రంలో కూడా తానే డ‌బ్బింగ్ చెప్పుకుంది. ఈ చిత్రంలో నాగ‌శౌర్య హీరోగా న‌టించాడు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించాడు.

ఈ చిత్రం ద్వారా త‌మిళంలో సాయి ప‌ల్ల‌వి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. అక్క‌డ ఈ సినిమా 'కరు' అనే పేరుతో విడుద‌లకాబోతుంది. ఈ రెండు భాష‌ల ట్రైల‌ర్ల‌ను న‌టుడు, ద‌ర్శ‌కుడు ప్ర‌భుదేవా విడుద‌ల చేశారు. సాయి ప‌ల్ల‌వి ప్ర‌స్తుతం నాని స‌ర‌స‌న న‌టిస్తోన్న 'ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)' టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

More Telugu News