sai dharam tej: అందుకే దిల్ రాజు ఎంటరయ్యారు... 'జవాన్' విషయంలో క్లారిటీ ఇచ్చిన హరీశ్ శంకర్!

  • ఒకేసారి డైరెక్షన్ .. ప్రొడక్షన్ చూసుకోలేకపోయాను 
  • అందుకే 'జవాన్'లోకి దిల్ రాజు ఎంటరయ్యారు
  • తేజు కెరియర్ లో ప్రత్యేకమైన సినిమా అవుతుంది    

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా రూపొందిన 'జవాన్' సినిమా .. వచ్చేనెల 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీశ్ శంకర్ మాట్లాడుతూ ఓ విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు. మొదట్లో ఈ సినిమాకి హరీశ్ శంకర్ సమర్పకుడిగా వున్నారు. ఆ తరువాత పోస్టర్స్ పై ఆయన పేరుకు బదులుగా దిల్ రాజు పేరు కనిపించింది. దాంతో హరీశ్ శంకర్ ఈ ప్రాజెక్టు నుంచి ఎందుకు తప్పుకున్నాడనేది చాలామందికి అర్థం కాలేదు.

 తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ .. "నేను 'దువ్వాడ జగన్నాథం' సినిమా షూటింగులో బిజీగా ఉండేవాడిని. మరో వైపున 'జవాన్' సినిమా ప్రొడక్షన్ పనులు చూసుకోవడం నాకు కష్టమైంది. అందువల్లనే ఆ ప్రాజెక్టులో నుంచి నేను తప్పుకుని .. ఆ స్థానంలోకి దిల్ రాజును తీసుకొచ్చాను. అంతే తప్ప ఈ విషయంలో మరేమీ జరగలేదు" అంటూ క్లారిటీ ఇచ్చాడు. "ఇక సాయిధరమ్ తేజ్ సినిమాలన్నీ ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక్కటీ ఒక ఎత్తు" అంటూ స్పష్టం చేశాడు.   

More Telugu News