Nara Lokesh: చంద్ర‌బాబు చాలా బాధ‌ప‌డ్డారు: నంది అవార్డుల‌ వివాదంపై స్పందించిన లోకేశ్

  • ఏపీలో ఆధార్ కార్డు లేని వారు విమ‌ర్శ‌లు చేస్తున్నారు
  • కొంద‌రు హైద‌రాబాద్‌లో కూర్చొని ఏపీ ప్ర‌భుత్వం గురించి మాట్లాడుతున్నారు
  • హైద‌రాబాద్‌లో కూర్చొని ఏం చేయాలో చెబితే ప్ర‌జ‌లు హ‌ర్షించ‌బోరు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది అవార్డుల విష‌యంపై విమ‌ర్శ‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి నారా లోకేశ్ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. కొంద‌రు హైద‌రాబాద్‌లో కూర్చొని ఏపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తున్నారని అన్నారు. ఏపీలో ఆధార్, ఓట‌ర్ కార్డు లేని వారు కూడా ప్ర‌త్యేక హోదా, నంది అవార్డుల‌పై విమ‌ర్శ‌లు చేస్తే ఎలా? అని ప్ర‌శ్నించారు.

నంది అవార్డుల ప్ర‌క‌ట‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డంతో సీఎం చంద్ర‌బాబు నాయుడు చాలా బాధ‌ప‌డ్డార‌ని లోకేశ్ తెలిపారు. హైద‌రాబాద్‌లో కూర్చొని ఏం చేయాలో చెబితే ప్ర‌జ‌లు హ‌ర్షించ‌బోర‌ని వ్యాఖ్యానించారు. నంది అవార్డుల‌పై విమ‌ర్శ‌లు చేస్తోంది ఇద్ద‌రు, ముగ్గురు మాత్ర‌మేన‌ని అన్నారు.   

More Telugu News